Wednesday 8 August 2012

లక్ష్మీ నరసింహస్వామి


హైదరాబాద్‌కు 60 కి.మీ దూరంలో సికింద్రాబాద్- కాజీపేట్ మార్గంలో భోన్‌గిర్ సమీపంలో ఉన్న కొండప్రాంతం. యాదగిరిగుట్ట అని పిలువబడే 300 అడుగుల ఎత్తున్నఈ గుట్టపై (కొండ)పై లక్ష్మీ సమేత నరసింహస్వామి కొలువు దీరారు.

ఆ ఆలయంలో జ్వాలా నరసింహ, గండబేరుండ నరసింహ, యోగ నరసింహలను భక్తులు పూజిస్తారు. అంతేకాదు, ఈ ఆలయంలో లక్ష్మీనరసింహుని వెండి విగ్రహాలు దర్శమిస్తాయి. ఈ ఆలయ ద్వారం వద్ద హనుమంతుడి ఆలయం ఉంది. ఈ ఆలయ మధ్యలో ఖాళీ స్థలం ఉంటుంది. దీనినే గండబేరుండ నరసింహ అని అంటారు. అంతేకాదు, గుట్ట(కొండ)పై ఓ శివాలయం కూడా ఉంది.

స్థలపురాణం:
పూర్వం రష్యసృంగుని కుమారుడు యాదవుడు విష్ణు మూర్తిని మూడు అవతారాలలో చూడాలని ఘోర తపస్సు చేశాడట. ఈ కోరికను మన్నించిన విష్ణుమూర్తి ఆ గుట్టపై వెలిశాడు. అప్పటినుంచి ఈ కొండకు యాదగిరికొండ అనే పేరు వచ్చింది.

ఈ ప్రాంతంలో ఋషులు తపస్సు చేస్తారు కనుక, దీనికి ఋషి ఆరాధనా క్షేత్రంగా పేరు వచ్చింది. హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత ఉగ్రనరసింహుడు ప్రహ్లాదునికి దర్శనమిచ్చారనేందుకు సాక్ష్యంగా ఇక్కడ ఓ గుహ ఉంది.

దెయ్యాలు పట్టినవారు, దుష్టశక్తులచే ప్రభావితం అయినవారు, చేతబడులు జరిగినవారు ఇక్కడకు అధికంగా వస్తారు. ఈ స్వామి వారికి స్వప్నంలో కనిపించి వారి వ్యాధులను నయం చేసినట్టు చాలా సందర్భాలు చెబుతున్నాయి. రాజధానిలో ఉన్న ఆధ్యాత్మిక ప్రాంతాల్లో ఇది అతి ముఖ్యమైనది. లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాల్లో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం.

No comments:

Post a Comment