పాండవుల కుమారులను ఉపపాండవులని పిలుస్తారు. ప్రతివింద్యుడు, శ్రుతసోముడు,
శ్రుతకీర్తి, శతానీకుడు, శ్రుతసేనుడు, వరుసగా ధర్మరాజు, భీముడు, అర్జునుడు,
నకుల, సహదేవులకు జన్మించారు. పూర్వజన్మలో వీరు విశ్వులనే దేవతలు.
ఉపపాండవులుగా వీరు జన్మించడం వెనుక హరిశ్చంద్రుని భార్య అయిన చంద్రమతిని
నగరము విడిచి వెళ్ళమని విశ్వామిత్రుడు అనడం చూసి, ఋషులకు ఇంత కోపము
పనికిరాదని విశ్వువులు అనుకుంటారు. ఇది విన్న విశ్వామిత్రుడికి కోపము
వచ్చి, నరులుగా జన్మించమని శపిస్తాడు. ఆ శాపం వల్ల వారు ఉపపాండవులుగా
జన్మిస్తారు. మహాభారత యుద్ధ సమయంలో అశ్వత్థామ వీరిని రాత్రిపూట రహస్యంగా
సంహరిస్తాడు.
No comments:
Post a Comment